తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు స్పందన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశించారు . సోమవారం కాకినాడ కలెక్టరేట్ లో కలెక్టర్ మురళీధర్ రెడ్డి అధ్యక్షతన జేసి-2 జి.రాజకుమారి,డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు,బిసి కార్పొరేషన్ ఇడి ఎస్.వి.ఎస్.సుబ్బలక్ష్మి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి అర్జీదారులు హాజరై తమ సమస్యలు, వినతులను జిల్లా కలక్టర్ కు విన్నవించారు.
నేటి స్పందనలో మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి గృహాలు, పెన్షన్లకు 3,500 అర్జీలు, అదే విధంగా రెవెన్యూకు 589, డిఆర్.డి.ఏ పింఛన్లు 72, రూరల్ హౌస్ సైట్స్ 500, రేషన్ కార్డులు 65, ప్రజాసాధికార సర్వే 82, పట్టణ హౌస్ సైట్స్ 350 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా కలక్టరు డి.మురళిధర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చిన ప్రతీ అర్జీ పై ప్రత్యేక శ్రధ్ధ చూపి, ఆ సమస్య పరిష్కార దిశలో చర్యలు చేపడుతున్నారన్నారు.