ఢిల్లీ: దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. రాజ్ఘాట్లో మహత్మాగాంధీ సమాధికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అక్కడి నుంచి ఎర్రకోటకు చేరుకున్న ప్రధాని తివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఎర్రకోటపై మోడీ జెండా ఆవిష్కరించడం ఇది ఆరోసారి. జెండా ఆవిష్కరణ అనంతరం మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వరద మృతులకు మోడీ నివాళులర్పించారు. కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఇతర కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.