ఎన్.ఎం.సి బిల్లుకు కారణంగా వైద్య వ్యవస్థను దెబ్బతీస్తుందని, సామాన్యులకు వైద్యం అందకుండా పోతుందని ఈ బిల్లుకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సిద్ధార్థ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు , వైద్య విద్యార్థుల పై పోలీసుల దౌర్జన్యజి చేయడానికి ప్రజారోగ్య వేదిక ఖండించింది. ఈ మేరకు బుధవారం ఖండిస్తోందని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం వి రమణయ్య, ప్రధాన కార్యదర్శి కె.కామేశ్వరరావులు ఒక ప్రకటన విడుదల చేస్తూ NMC బిల్లు ఆచరణలోకి వస్తే వైద్య వ్యవస్థ మరియు వైద్య విద్యలో కార్పొరేటీకరణ పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య రంగాన్ని కాపాడుకోవడం కోసం డాక్టర్లు, వైద్య విద్యార్థులు ప్రజా సంఘాలు, ప్రజలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సందర్భంలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని విషయం హోమ్ మంత్రి వరకు వెళ్లినా చర్యలు ఇంకాలేవని విచారం వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ ఎం సి బిల్లును ఉపసంహరించుకోవాలని ఈ బిల్లు రద్దు కోసం రేపు జరగబోయే దేశవ్యాపిత సాధారణ వైద్య సేవల బంద్ కు మద్దతు ఇస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు .