ట్రెండింగ్
Epaper    English    தமிழ்

6 నుంచి ఏపీ ఐసెట్‌ 2019 కౌన్సెలింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2019, 02:58 PM

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంసీఏ, ఎంబీఏ కళాశాలల్లో సీట్లభర్తీకి సంబంధించిన ఏపీ ఐసెట్‌ 2019 కౌన్సెలింగ్‌ను ఈనెల 16నుంచి 19వ తేదీ వరకూ నిర్వహించనున్నారు.కాకినాడ పరిధిలో రెండు వెబ్‌బేస్‌డు కౌన్సెలింగ్‌ సహాయ కేంద్రాలను జేఎన్టీయూకే, ఆంధ్రా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఏర్పాటుచేశారు.


16న 1వ ర్యాంకు నుంచి 8000 ర్యాంకు వరకు, 17న 8001నుంచి 19,000 ర్యాంకు వరకు, 18న 19,001 నుంచి 31,000 వరకు, 19న 31,001 నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నామని, 19నుంచి 21వ తేదీ వరకు 1నుంచి చివరి ర్యాంకు వరకు గల అభ్యర్థులు ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చని జేఎన్టీయూకే సహాయకేంద్ర సమన్వయకర్త ప్రొఫెసర్‌ బాలాజీ తెలిపారు.


కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఏపీఐసెట్‌ హాల్‌టిక్కెట్‌, ర్యాంక్‌కారు,్డ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, టీసీ, పీసీ, స్టడీ, నివాస ధ్రువపత్రం, ఆదాయ,కుల, ఆధార్‌ ధ్రువపత్రాలతోపాటూ రెండుసెట్ల జిరాక్స్‌ కాపీలను తీసుకురావాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com