శ్రీకాకుళం: జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కామినేని శ్రీనివాస్ కాశిబుగ్గలో ఉన్న సీఎం ఆరోగ్యకేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా అని, సరైన వైద్యం అందిస్తున్నారని వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రికి సంబంధించిన పలు ఫైళ్లను ఆయన పరిశీలించారు. అదేవిధంగా పలాసలో కూడా ఆయన డయాలసిస్ సెంటర్ను ప్రారంచారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.