ముంబయిలోని బాంద్రా ఎంటీఎన్ఎల్ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. భవనంలోని 3,4 అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో వంద మంది చిక్కుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు సిబ్బంది భవనంపైకి చేరుకున్నారు. 14 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.