విజయవాడ కనక దుర్గమ్మను గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఈవో, పండితులు గవర్నర్ కు స్వాగతం పలికారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డితో పాటు కీలక నేతలకు గవర్నర్ విందు ఇవ్వనున్నారు. ఏపీ గవర్నర్గా తనకు సహాయ సహకారాలు అందించినందుకు నరసింహన్ ఈ విందు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. ఎల్లుండి కొత్త గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ఏపీకి వస్తున్నారు. ఈ నెల 24న విజయవాడలోని రాజభవన్లో హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.