హైదరాబాద్: రెండు రోజుల క్రితం ప్రాణాలు విడిచిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్కు ఇవాళ పార్లమెంట్ నివాళి అర్పించింది. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా నివాళి అర్పించారు. తొలుత ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. ఆ తర్వాత సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభను కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇవాళ సభలో మానవ హక్కుల సవరణ బిల్లు గురించి చర్చించనున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్, సమాచార హక్కు, మోటార్ వెహికిల్ బిల్లులను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు.