ఐపీఎల్10: హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో ఎడిషన్ ప్రారంభ వేడుకలు ఉప్పల్ మైదానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. గత ఏడాది ఛాంపియన్స్ సన్రైజర్స్ హైదరాబాద్, రన్నరప్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. తొలుత గత శతాబ్దపు భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెందుల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ను ముఖ్య అతిథులుగా మైదానంలోకి ఆహ్వానించారు. తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో వీరంతా ఉప్పల్ మైదానమంతా తిరిగి అభివాదం చేశారు. ఐపీఎల్ పదో ఏడాదిలోకి అడుగు పెట్టినందుకు ఆనందం వ్యక్తం చేశారు.
సన్మానం
ఈ సందర్భంగా నలుగురు దిగ్గజాలను బీసీసీఐ పెద్దలు సత్కరించారు. బీసీసీఐ పాలకుల కమిటీ పెద్ద వినోద్రాయ్.. వీవీఎస్ లక్ష్మణ్కు జ్ఞాపిక అందజేశారు. సీకే ఖన్నా గంగూలీకి, అమితాబ్ చౌదరి వీరేంద్ర సెహ్వాగ్కు, ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా సచిన్ తెందుల్కర్కు జ్ఞాపికలు అందజేశారు.