ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ‌ద్రీనాథ్‌ ఆలయ కమిటీకి రూ.2 కోట్లు విరాళంఅందించిన ముఖేష్ అంబానీ!

national |  Suryaa Desk  | Published : Sat, May 25, 2019, 07:32 PM

ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత బద్రీనాథ్ ఆలయాన్ని శనివారం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. అంబానీకి బీకేటీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి బీడీ సింగ్ ధర్మాధికారి, ఆఫీసర్ భువన్ చంద్ర ఉనియల్ ఘన స్వాగంతం పలికారు. ఆలయంలో శివుడికి  ప్రత్యేక పూజలు చేసిన అంబానీ..బ‌ద్రీనాథ్‌ కేదారినాథ్ ఆలయ కమిటీకి రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా అంబానీ మాట్లాడుతూ.. ‘దేశం సుభిక్షంగా ఉండాలని దేవుడిని కోరుకున్నాను. మా తండ్రి ధీరూభాయ్ అంబానీ పేరుతో తమిళనాడులోని శాండిల్‌వుడ్ ఆలయంలో భూమి కొనుగోలు చేస్తాం’ అని ముఖేష్ అంబానీ హామీ ఇచ్చారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com