ఎన్నికల విధుల కోసం వెళ్లిన ఓ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన త్రిపురలోని ధలై జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. బస్సులో ఒంటరిగా ఉన్న సమయంలో తన తుపాకీతో తానే కాల్చుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు.. జవాన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని ఆశ్విని కుమార్(50)గా పోలీసులు గుర్తించారు. ఆశ్విని కుమార్ జమ్మూకశ్మీర్కు చెందిన వ్యక్తి. బీఎస్ఎఫ్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా ఆశ్విని కుమార్ విధులు నిర్వర్తిస్తున్నాడు. జవాను ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.