మహాత్మా గాంధీ(కొత్త) సిరీస్లో రూ.10 విలువ గల కొత్త బ్యాంకు నోటును త్వరలో విడుదల చేయనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ప్రకటించింది. కొత్త నోట్లపై గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటుందని తెలిపింది. మహాత్మాగాంధీ(కొత్త) సిరీస్లోని రూ.10నోట్ల డిజైన్ తరహాలోనే కొత్త నోట్ల నమూనా ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొంది. గతంలో ఆర్బీఐ విడుదల చేసిన రూ.10నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని వివరించింది.