లోక్సభ ఎన్నికలను నిర్వహించిన తీరు పట్ల ఎన్నికల సంఘంపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు కురిపించారు. అత్యంత సమర్థవంతంగా లోక్సభ ఎన్నికలు నిర్వహించినట్లు ఆయన ఈసీ అధికారులను మెచ్చుకున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయాలనుకుంటే, మన దేశంలో వ్యవస్థలన్నీ సమర్థంగా పనిచేస్తున్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రణబ్ అన్నారు. ఎన్నికల సంఘం అధికారులు సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించడం వల్ల మన ప్రజాస్వామ్యం విజయవంతమైందన్నారు. ఎన్నికల కమీషనర్ సుకుమార్ సేన్ నుంచి నేటీ వరకు ఆ పదవిలో ఉన్న ప్రతి ఒక్కరు ఎన్నికల నిర్వహణను పటిష్టంగా చేపట్టారన్నారు. వాళ్లను విమర్శించలేమని, చాలా పర్ఫెక్ట్గా ఎన్నికలు నిర్వహించారని ప్రణబ్ కితాబు ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వ వ్యవస్థలన్నీ అద్భుతంగా ఉన్నాయని, ఎన్నో ఏళ్ల శ్రమతో వాటిని పకడ్బందీగా తయారు చేశామని ప్రణబ్ తెలిపారు.