మత సామరస్యానికి ప్రతీకగా అయోధ్యలోని శ్రీ సీతారామ ఆలయం నిలిచింది. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆలయ ప్రాంగణంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఆలయం పూజారి యుగల్ కిషోర్ మాట్లాడుతూ ఆలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఇది మూడవ సారి అని చెప్పారు. ఇకముందు కూడా దీనిని కొనసాగిస్తామని ఆయన అన్నారు. అన్ని పండుగలను ఉత్సాహంగా జరుపుకోవాలని ఆయన అన్నారు. ఇఫ్తార్ విందుకు హాజరైన అనేకులు తాము హిందువులతో కలిసి వారి పండుగలను చేసుకుంటూ ఉంటామన్నారు. ముజమ్మిల్ ఫిజా మాట్లాడుతూ తన హిందూ స్నేహితులతో కలిసి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటానని చెప్పారు. ఒక ప్రత్యేక అజెండాతో పని చేసేవారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడాన్ని జీర్ణం చేసుకోలేరని ఆయన అన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న వారికి యుగల్ కిషోర్ ప్రేమాభిమానాల సందేశాన్ని పంపించారని ఫిజా అన్నారు.