కేరళ: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్లో నిల్చున్నారు. కన్నూర్ జిల్లా పెనరాయి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద సీఎం విజయన్ క్యూలైన్లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.