దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో పోలింగ్ జరుగుతోంది. మూడో విడత పోలింగ్కు దేశ వ్యాప్తంగా 2,10,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. 116 పార్లమెంటు నియోజకవర్గాల బరిలో 1,640 మంది అభ్యర్థులు నిలిచారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరారు. పలు చోట్ల ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అహ్మదాబాద్ లో ప్రధాని మోడీ, కేరళలోని కన్నూరు జిల్లాలో సీఎం పినరయి విజయన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశ వ్యాప్తంగా ఒడిశా, గుజరాత్, గోవాలో పలు అసెంబ్లిd స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్లో 26 లోక్సభ, 4 అసెంబ్లిd స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అలాగే ఒడిశాలో 6 లోక్సభ, 42 అసెంబ్లిd స్థానాలకు, గోవాలో 2 లోక్సభ, 3 అసెంబ్లిd స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. కేరళలో 20, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 14, యూపీలో 10, ఛత్తీస్గఢ్లో 7, బీహార్లో 5, బెంగాల్లో 5, అసోంలో 4 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. జమ్మూకాశ్మీర్, దాద్రానగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, త్రిపురలో ఒక్కో స్థానానికి పోలింగ్ నిర్వహిస్తున్నారు. జమ్మూకాశ్మీర్ అనంతనాగ్లో బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.