ఈ మధ్య వివాహాల విషయంలో ట్రెండ్ మారుతోంది. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు, వీడియోలు తీసుకోవడం బాగా ఎక్కువవుతోంది. దీని కోసం ఎంత ఖర్చుకైనా, సాహసానికైనా పెళ్లి జంటలు వెనుకాడట్లేదు. అలాగే కేరళలో ఓ జంట నదీ తీరంలో ప్రీ వెడ్డింగ్ షూట్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ జరిగిన అనూహ్య సంఘటన వారి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసింది.
కేరళకు చెందిన తిజిన్, శిల్పల జంట మే 6న వివాహబంధంతో ఒక్కటి కానుంది. ఈ సందర్భంగా ఈ జంట పంబా నదీ తీరంలో ప్రీ వెడ్డింగ్ షూట్ ఏర్పాటు చేసుకుంది. ఫోటోగ్రాఫర్ ఒక పడవలో ఉండి ఫోటోలు తీస్తుండగా, తిజిన్, శిల్ప మరో పడవలో కూర్చున్నారు. ఫోటోలు తీయించుకునే క్రమంలో ఈ జంట అదుపు తప్పి నీటిలో పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.