దిల్లీ: దిల్లీలోని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాసంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పండితుడు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రమణ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రులు మహేశ్ శర్మ, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. అతిథుల కోసం ప్రత్యేకంగా ఉగాది పచ్చడి, దక్షిణాది వంటకాలను వెంకయ్యనాయుడు సిద్ధం చేయించారు.