తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనకున్న వారిని వెంటనే పట్టుకోవాలని, కేసు విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని వివేకా కుమార్తె వైఎస్ సునిత సీఈసీని కోరారు. శుక్రవారం ఆమె సిట్ అధికారుల పనితీరు ని తప్పుబడుతూ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసు ను విచారిస్తున్న సిట్ అధికారులు ఎప్పటికప్పుడు డీజీపీ, సీఎం చంద్రబాబుల కు వివరాలు ఇస్తున్నారని వీటిరి ఆసరాగా తీసుకునిమా అన్న జగన్ మీద కావాలనే ఆరోపణలు చేస్తు, రాజకీయంగా మా నాన్న హత్యను వాడుకోవాలని చూస్తున్నారనా ఈమె ఆరోపించారు. . సిట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తుంది కాబట్టి విచారణ పారదర్శకంగా జరగటం లేదన్న విషయాన్ని సిఈసి దృష్టికి తీసుకువచ్చానని, తనని హోంశాఖను కలమని వారు చెప్పారన్నారు. మా నాన్న హత్య..వెనుక ఉన్న హంతకుల విషయంలో విచారణ పారదర్శకంగా జరిగేలా . కేంద్ర హోంశాఖ ను చర్యలు తీసుకోవాలని కోరుతామని సునీత తెలిపారు.