హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఈరోజు పలువురు వైసీపీలో చేరారు. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర, కాకినాడ ఎంపీ తోట నరసింహం దంపతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండ్లో పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సమక్షంలో వీరు చేరారు. సినీనటుడు రాజా రవీంద్ర, తోట నరసింహం దంపతులకు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.