ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రిని చేస్తున్నారంటే కొంచెం కంగారుగా ఉంది: నారా లోకేశ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2017, 12:27 AM

గుంటూరు : తాను తెలుగు దేశం పార్టీ (టిడిపి) జాతీయ ప్రధాన కార్యదర్శి అయి రెండేళ్లు అయిందని, ఇప్పుడు ఎమ్మెల్సీని చేశారని, రేపు మంత్రిని చేస్తున్నారంటే కొంచెం కంగారుగా ఉందని నారా లోకేశ్‌ అన్నారు. ఒక న్యూస్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో లోకేశ్‌ మాట్లాడుతూ, `ధైర్యం ఉంది. భయం కూడా ఉంది. ఆ పదవికి న్యాయం చేయాలి కదా! ఇప్పుడు టిడిపి ప్రధాన కార్యదర్శి పదవికి న్యాయం చేయాలంటేనే చాలా కష్టపడుతున్నాను. మంత్రి పదవికి న్యాయం చేయాలంటే దానికి తగిన శ్రమ పడాలి, ఫ్యామిలీ కో ఆర్డినేషన్‌ చేయాలి. మా అబ్బాయికి రెండేళ్లు. అది మరీ, బిగ్గెస్‌‌ట చాలెంజ్‌. మా నాన్న ఫోకస్‌ అంతా మనవడి మీదే ఉంది. నేను చిన్నప్పుడు ఏ స్కూల్‌కు వెళుతోంది.. ఏం చదువుతోంది .. నాన్న అసలు పట్టించుకోలేదు. నాన్న ఎఫర్‌‌ట జీరో. అంతా అమ్మే. నా కొడుకు విషయానికి వచ్చే సరికి మా నాన్న ఎఫర్‌‌ట బాగా ఉంటోంది' అని చెప్పుకొచ్చారు. 


మా అబ్బాయి నా కన్నా బిజీ!: నారా లోకేశ్‌


కొడుకు దేవాన్‌‌ష తన కన్నా చాలా బిజీగా ఉంటాడని లోకేశ్‌ చెప్పారు. `మా అబ్బాయిని ప్రీ స్కూల్‌, మాంటిస్సోరి ట్రైనింగ్‌ స్కూల్‌కు పంపిస్తున్నాము. ఉదయం 9 నుంచి 9.45 గంటల వరకు జిమ్నాస్టిక్‌‌స చేస్తాడు. 10.30 గంటలకు స్కూల్‌కు వెళతాడు. తిరిగివచ్చిన తరువాత ఒక రోజు సంస్కృత భాష, మరొక రోజు చైనీస్‌ భాష నేర్పిస్తాం. నా కన్నా బిజీ అయిపోయాడు. ఇంటిలో తెలుగులోనే మాట్లాడుకుంటాం. 


        మా వాడిని ఇంగ్లీషులో అడిగినా తెలుగులోనే సమాధానం చెబుతాడు. రోజూ పేపర్లు చూసి తాత ఇడిగో అని చెబుతాడు. అలానే, ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో చూసి మోడీతాత అని చెబుతాడు' అని తన కొడుకు దేవాన్‌‌ష గురించి లోకేశ్‌ చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com