విజయవాడ, మేజర్న్యూప్ : నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపారులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆహార తనిఖీ, నియంత్రణ విభాగం అధికారులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆదేశించారు. ఎప్పటి కప్పుడు తనిఖీలు ముమ్మరం చేయాలని చెప్పారు. నాసిరకం, కల్లీ ఆహార పదార్దాల వ్యాపారులు, నిర్వాహకులను ఉపేక్షించడం తగదన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు చిత్తశుద్దితో పని చేయాలని మంత్రి స్పష్టం చేశారు. పశువుల దాణాతో సున్ని ఉండలు, ఇతర ఆహార పదార్థాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం శిక్షించా ల్సిందేని మంత్రి చెప్పారు.