ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం కాపుల అభ్యున్నతికి కట్టుబడి హామీని నిలబెట్టుకుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 19, 2017, 01:32 AM

 విజయవాడ, సూర్య బ్యూరో : కాపు కార్పోరేషన్‌ కు 2017-18 బడ్జెట్‌లో  రూ.1000 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని కాపు కార్పోరేషన్‌ ఛైర్మన్‌ చలమలశెట్టి రామా నుజయ అన్నారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును 13 జిల్లాల కాపు కార్పోరేషన్‌ ప్రతినిధులతో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్బంగా రామాను జయ మాట్లాడుతూ ప్రభుత్వం కాపుల అభ్యున్నతికి కట్టుబడి చేస్తుందని, హామీని నిలబెట్టుకుని అన్ని విధాలా కాపు సామాజిక వర్గానికి అండగా నిలుస్తున్నారన్నారు. ఈ విషయంలో మాటకు నిలబడిన ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ఆదర్శ నాయకుడిగా కాపుల మదిలో చిరస్థాయిగా నిలుస్తారన్నారు. కాపు కార్పోరేషన్‌ ద్వారా లబ్ధిపొందిన యువత ద్వారా ఏప్రిల్‌ 2వ తేదీ నుండి 13 జిల్లాల స్థాయిల్లో కాపు కార్పోరేషన్‌ లబ్ధిదారుల అవగాహన సదస్సులను పెద్ద నిర్వహిస్తున్నామని కాపు కార్సోరేషన్‌ ఛైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ వెల్లడించారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియ జేసినవారిలో అఖిల భారత కాపు సమాఖ్య అధ్యక్షుడు నరహరిశెట్టి శ్రీహరి, ఉపాధ్యక్షుడు కె. లక్ష్మయ్య, ఘంటా గౌతమ్‌, అనంతపురం నుండి పవన్‌కుమార్‌, పశ్చిమగోదావరి నుండి పద్మారావు, కష్ణాకు చెందిన అడపా మాళవిక, గుంటూరుకు చెందిన భారతి, తూర్పుగోదావరికి చెందిన అప్పారావు, కార్పొరేషన్‌ సంచాలకులు వడ్డెర సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com