ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో బుధవారం మధ్యాహ్నం (30.1.2019) 3 గంటల నుంచి సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో మంత్రి మండలి సమావేశం ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.