ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుగా చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన మైసూరు శ్రీనివాసమూర్తిని నియమించినట్లు సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్శర్మ తెలిపారు. జిల్లాలోని సత్తెనపల్లి పట్టణంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు జ్వాలపురం శ్రీకాంత్ ఆదేశా ల మేరకు ఈ నియామకాన్ని ధృవీకరించడం జరిగిందన్నారు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘకాలం శాసనసభ్యునిగా, మాజీ ఆటవీశాఖ మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకనేతల్లో ఒకరైన ప్రధాన కార్యదర్శి పెద్ది రామచంద్రారెడ్డికి శ్రీనివాసమూర్తి అనుచరుడుగా ఉన్నారు. అలాగే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, . ఉన్నారు. బ్రాహ్మణులను చైతన్య పరచి సామాజిక, ఆర్ధిక, రాజకీయ హక్కులను సాధించే దిశగా శ్రీనివాసమూర్తి బాధ్యతలు నిర్వహించాలని సమాఖ్య నాయకులు ఈ సందర్భంగా సూచించారు.