ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్‌ మెుదటి వారంలోనే ఏపీ మంత్రివర్గ విస్తరణ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 18, 2017, 12:47 AM


 -ఆశా వహుల్లో పెరుగుతున్న ఆత్రుత
 -ఉన్న మంత్రుల్లో వేటు ఎవరికోనని టెన్షన్‌ 
 -కీలకంగా మారిన హోవ్గుమంత్రి, ఎెక్సైజ్‌ 
-నారా లోేకశ్‌కు ఐటీ, మునిసిపల్‌ శాఖలు?


  విజయవాడ, మేజర్‌న్యూస్‌ : ప్రస్తుతం జరుగుతోన్న అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రెల్‌ మొదటివారంలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకు సమయం దగ్గర పడడటంతో ఆశావాహుల్లో ఆత్రుత పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లోనూ ఎవరెవరిపై వేటు పడుతుందో నన్న టెన్షన్‌ కూడా కలుగుతోంది. టీడీపీ నేతల్లోనూ ఇదే అంశంపై సదా చర్చలు, గుసగుసలు జరుగుతుండడంతో అధినేత చంద్రబాబు కూడా ఆగ్ర హం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముందు నియోజకవర్గాల సమస్యలపై దృష్టి పెట్టండంటూ మంత్రివర్గ విస్తరణ గురించి చర్చలు మానండంటూ కోప్పడినట్లు సమాచారం. ఎమ్మెల్సీలుగా డిక్లరేషన్‌ పొందిన ఇద్దరికి మంత్రివర్గంలో చోటు ఖాయంగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్‌బాబుకు కేబినెట్‌ లో స్థానం ఖరారు అనే విషయం తెలిసిందే. ఐటీ, మున్సిపల్‌ శాఖలు లోకేశ్‌కు అప్పజెప్ప అవకాశం ఉంది. ప్రస్తుత పురపాలక శాఖ మంత్రి పి. నారాయణను సీఆర్‌డీఏ చైర్మన్‌ బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా డిక్లరేషన్‌ పొందిన మరో ఎమ్మెల్సీ మాజీ మంత్రి డొక్కా మాణిక్యావరప్రసాద్‌ను కూడా మంత్రివర్గంలో తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల విషయంలోనూ అసలు చిక్కు అధినేతను వెంటా డు తున్నట్లు తెలుస్తోంది. వలస నేతలకు మంత్రి పదవులు ఇచ్చేందుకు గవర్నర్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమచారం. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించి టీడీపీ తరపున పోటీచేసి గెలిచి మంత్రి పదవి కట్టబెట్టాలని చెబుతున్నట్లు సమాచారం. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఢిలా పడుతున్నారు. అయితే కొంతమందికి నామినేటెడ్‌ పదవులు అప్పజెప్పేందుకు చంద్రబాబు నిర్ణయించారు. వైసీపీ నుంచి వచ్చిన జ్యోతుల నెహ్రూకు గుడా(గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)కి చైర్మన్‌గా చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇంతవరకు గుడాకు చైర్మన్‌ పదవి లేదు. అయితే చైర్మన్‌ పదవిని ఏర్పాటుచేసి జ్యోతుల నెహ్రూకుగానీ, అతడి కుమారిడికి గానీ ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని బాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క స్థానానికి గవర్నర్‌ను ఒప్పించాలని చూస్తున్నట్లు సమాచారం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌కు మంత్రివర్గంలోకి తీసుకునే వీలుంది. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను మంత్రివర్గంలోకి తీసుకుంటారని గుసగసలు వినిపిస్తున్నాయి.


   ఎమ్మెల్యే అనిత జిల్లా అయిన విశాఖ నుంచి ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు ప్రస్తుత కేబినెట్‌లో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో వారెవరిపైనా వేటు పడే అవకాశం లేదు. కాబట్టి ఎమ్మెల్యే అనితకు అవకాశం ఇస్తే జిల్లాలో మొత్తం ముగ్గురు మంత్రులు ఉంటారనే సంశయిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరి మంత్రులకు రెండు కంటే ఎక్కువగా ఉన్న శాఖలను కూడా కుదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఐటీ, సాంస్కృతికం, మైనారిటీ సంక్షేమం, సమాచార శాఖలు ఉన్నాయి. లోకేశ్‌కు ఐటీ శాఖ ఇచ్చి, మైనారిటీ సంక్షేమం కూడా వేరేవారికి అప్పజేప్పే వీలుంది. 


    మానవ వనరుల అభివృద్ధి శాఖలోని ఉన్నత విద్య, ప్రాథమిక విద్య విభాగాలుగా మార్చి పంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ సంక్షేమశాఖ, ఎకై్సజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శాఖల్లోనూ కటింగ్‌ తప్పేలా లేదు. ఎకై్సజ్‌ శాఖకు గట్టి పోటీ ఏర్పడుతుంది. కొత్తగా వచ్చే మంత్రులకు ఎకై్సజ్‌ శాఖ అప్పజేప్పే అవకాశం ఉంది. కళా వెంకట్రావుకు కేబినెట్‌లో స్థానం ఖరారయితే హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకు చినరాజప్ప కూడా ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే హోంమంత్రి కేటాయింపు చాలా కీలకం కానుంది. ముఖ్యమంత్రి తరువాత అత్యంత ప్రాధాన్యం ఉన్న హోం మంత్రి స్థానం భర్తీపై ఇంకా ఎటువంటి సంకేతాలు లేవు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com