విజయవాడ, సూర్యబ్యూరో : అమరావతి రాజధాని నగరంలో చేపడుతున్న మౌలిక సదుపా యాల కల్పన పనులపై ఆయా గ్రామాల ప్రజలకు, రైతులకు స్పష్టమైన సమాచారం అందించాలని ఏపీసీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. విజయవాడ ఏపీసీ ఆర్డీఏ కార్యాలయంలో మార్చి 17న శుక్రవారం నాడు నిర్వహించిన ఇంజినీరింగ్ అధికారులు, డైరెక్టర్ల సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న పనుల ప్రగతిని, వాటికి అవసరమైన వివిధ శాఖల సమన్వయాన్ని సమీక్షించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఆయా పనులు వివరించేందుకు గ్రామ స్థాయి సమావేశాలు నిర్వ హించాలన్నారు. ఆయా పనుల వివరాలను తెలిపే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు, రోడ్లు, భవనాల నిర్మాణానికి అవసరమైన ఇసుక, గ్రావెల్ కొరత లేకుండా చూడాలని అధి కారులకు కమిషనర్ సూచించారు. ప్రకా శం బ్యారేజీ పూడికతీత (డ్రెడ్డింగ్)లో భాగంగా లభించే ఇసుకను పనులకు ఉప యోగించాలన్నారు. రాజధాని పరిధిలో జరిగే నిర్మాణ పనులకు సుమారు 7 లక్ష ల క్యూబిక్ మీటర్లపైన ఇసుక, 25 నుంచి 35 లక్షల క్యూబిక్ మీటర్ల కంకర అవసర మవుతుందని చెప్పారు. రాజధాని నగ రం, కోర్ ప్రాంతం నుంచి వెళుతున్న విద్యుత్ లైన్ల మార్పిడిపై చర్యలు తీసుకోవాల్సిదింగా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ సుజల పథకంలో భాగంగా వెంకటపాలెం, హరి శ్చంద్రపురంలో నిర్మించనున్న వాటర్ ప్లాంట్లకు అవసరమైన నీటి సోర్సులు చూపాలని అధికా రులను కమిషనర్ ఆదేశించారు. వాటర్ ప్లాంట్లకు విద్యుత్ సరఫరాను ఇచ్చేందుకు చర్యలు తీసుకోవా లన్నారు. ఈ సమావేశంలో గుంటూరు జాయింట్ కలెక్టర్ కతికా శుక్లా, ఏపీసీఆర్డీఏ అదనపు కమిష నర్లు వి.రామమనోహరరావు, డాక్టర్ ఎ. మల్లి కార్డున, సీఈలు అబ్దల్ షూకూర్, డి. కాశీ విశ్వే శ్వరావు తదితరులు పాల్గొన్నారు.