ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జ్

national |  Suryaa Desk  | Published : Sun, Jan 20, 2019, 07:07 PM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. షా ఆరోగ్యం మెరుగవ్వడంతో... ఆదివారం ఆస్పత్రి నుంచి డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ఆస్పత్రి నుంచి ఆయన నేరుగా ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ అమిత్ మాలవ్యా ట్విట్టర్‌లో తెలిపారు. ‘అమిత్ షా పూర్తిగా కోలుకున్నారు. ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం కుదుటపడడంతో సంతోషంగా ఉంది.. శ్రేయోభిలాషులు, కార్యకర్తలందరి తరపున అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు.
నాలుగు రోజుల క్రితమే అమిత్‌ షా అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. స్వైన్‌ ఫ్లూ సోకిందని తేల్చారు. ఎయిమ్స్‌ ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయన్ను పర్యవేక్షించింది. అయితే స్వైన్ ఫ్లూ అని తేలడంతో.. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమయ్యింది. కానీ స్వైన్ ఫ్లూ తొలి దశలోనే ఉండటంతో త్వరగా కోలుకున్నారు. తాను అస్వస్థతకు గురైనట్టు అమిత్‌ షా బుధవారం ట్విటర్ ద్వారా తెలియజేశారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com