మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం పొక్కడంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ రాధా ఇంటికి వెళ్లి సుమారు గంటపాటు భేటీ అయి చర్చించారు. బొత్స భేటీలో కూడా రాధా తన నిర్ణయం మార్చుకోలేదు. త్వరలోనే పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.