ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షేమ కార్యక్రమాల సృష్టికర్త ఎన్టీఆర్ : సోమిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 18, 2019, 12:51 PM

నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహానికి నివాళులర్పించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, టీడీపీ నాయకులు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదానం చేసిన యువతకు అభినందన


మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ ...తెలుగు జాతికి గర్వకారణం ఎన్టీఆర్..సంక్షేమ కార్యక్రమాల సృష్టికర్త ఎన్టీఆర్. రూ.2కే కిలో బియ్యం, సామాజిక పింఛన్, మండల వ్యవస్థ, సింగిల్ విండో వ్యవస్థ ఇలా ఎన్నో కార్యక్రమాలను శ్రీకారం చుట్టిన మహానుభావుడు. ఆనాడు ఎన్టీఆర్ రూ.30తో సామాజిక పింఛన్ కు శ్రీకారం చుడితే ఈ రోజు చంద్రబాబు నాయుడు రూ.2 వేలకు పెంచారు. సంక్షేమ కార్యక్రమాల అమలు, రైతులకు సేవ చేయడంలో ఏపీని దేశానికి ఆదర్శంగా నిలిపారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాం. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఆనాడు ఎన్టీఆర్ ఢిల్లీతో పోరాటం చేస్తే, ఈ రోజు ఆంధ్రుల హక్కుల కోసం చంద్రబాబు నాయుడు పోరాడుతున్నారు. ఆంధ్రులకు ఎన్డీఏ చేసిన అవమానాన్ని తిప్పికొట్టడానికి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటిని ఒకే వేదికపైకి తీసుకొస్తున్నారు. ఆంధ్రాను వ్యతిరేకించి, ఇక్కడి ప్రజలను నీచంగా మాట్లాడే కేసీఆర్ తో ప్రతిపక్ష నేత జగన్ జతకట్టడం దురదృష్టకరం. ఏపీ ప్రజల ప్రతిష్టను కాపాడుకునే సత్తా గల పార్టీ టీడీపీ


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com