ఢిల్లీలో ఏపీ ప్రత్యేక హోదా కోసం జంతర్ మంతర్ దగ్గర ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనా కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నం చేస్తున్న సమితి సభ్యులను అడ్డుకున్న పోలీసులు. వారిపై లాఠీలు ఝులిపించారు. లాఠీ దెబ్బలకు కొంతమంది సభ్యులు సొమ్మసిల్లి పోయినట్టు సమాచారం. వీరిని అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి దూరంగా ఉన్న ప్రాంతానికి తరలించి విడచి పెట్టినట్టు సమాచారం అందుతోంది.