ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెక్రటేరియట్ లో వందేమాతర గీతం : సీఎం కమల్ నాథ్

national |  Suryaa Desk  | Published : Thu, Jan 03, 2019, 08:05 PM

జాతీయ గేయం వందేమాతరం పాట పాడటంపై ఉన్న వివాదానికి మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్. ఫుల్ స్టాప్ పెట్టారు వందేమాతరం పాడి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభించే సంప్రదాయాన్ని మధ్యప్రదేశ్ లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాటించడం లేదంటూ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన‌ ఆరోపణ  కి కౌంటర్ ఇచ్చిన కమల్ నాథ్.. రెండురోజుల కింద ఇదే విషయంపై మాట్లాడుతూ.. దేశభక్తి అనేది మనసులో ఉండాలని చెప్పారు. తాజాగా ఈ వివాదానికి పుల్ స్టాప్ పెడుతూ… కొత్త నిర్ణయం ప్రకటించారు.


మధ్యప్రదేశ్ సెక్రటేరియట్ అయిన వల్లభ్ భవన్ లో.. ప్రతి నెలా ఫస్ట్ వర్కింగ్ డే నాడు… ఉదయం 10గంటల 45 నిమిషాలకు వందేమాతర గేయాన్ని పాడాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. శౌర్య సమారక్ నుంచి… సెక్రటేరియట్ వరకు పోలీస్ మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తారని చెప్పారు. దేశభక్తి భావం ఉప్పొంగేలా ఆ సమయంలో పోలీస్ బ్యాండ్ ప్లే చేస్తారని చెప్పారు. సెక్రటేరియట్ లోకి వస్తున్న టైమ్ లో… జాతీయ గీతం జనగణమన… జాతీయ గేయం వందేమాతరం పాడతారని సీఎం కమల్ నాథ్ ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com