ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్‌లతో బిజేపి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ : ఎన్‌.రఘువీరారెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2017, 12:43 AM

విజయవాడ, సూర్య బ్యూరో : భారతీయ జనతా పార్టీ అవలంభించే రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలను టీడీపీ ప్రశ్నించాలని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.రఘువీరారెడ్డి డిమాండ్గ చేశారు. సోమవారం విజయవాడలోని ఆంధ్రరత్నభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. భూమా నాగిరెడ్డి మరణం తనను ఎంతగానో కలచివేసిందన్నారు. భూమా తనకు మంచి స్నేహితుడని తెలిపారు. భూమా కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఐదు రాష్ర్టల ఎన్నికల్లో మణిపూర్‌, గోవాలో సింగిల్‌ లార్జెస్‌‌ట పార్టీగా ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. హంగ్‌ వచ్చినప్పుడు సింగిల్‌ లార్జెస్‌‌ట పార్టీలను ప్రభుత్వం ఫాం చేసేందుకు గవర్నర్‌ పిలుస్తారని తెలిపారు. 11న కౌంటింగ్‌ పూరె్తైందని, బీజేపీ ముఖ్యనేతలు బరితెగించి, మణిపూర్‌, గోవాలో ప్రభున్ని ఏర్పాటు చేస్తాం అని ఎలా చెప్తారని రఘువీరారెడ్డి ప్రశ్నించారు. ఆ రాష్ర్ట గవర్నర్‌లు ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చెయాలని పిలవటం లేదన్నారు. గవర్నర్లు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేశారనే  అనుమానాలు తమకు ఉన్నాయన్నారు. గవర్నర్లు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని వ్యాక్యానించారు. ఏపీ నుండి సీఎం చంద్రబాబునాయుడు ప్రధానికి ఫొన్‌ చేసి అబినందించారని అయితే బీజేపీ ఇలాంటి రాజ్యంగ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ప్రశ్నించడంలేదని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో కిసాన్‌ సెల్‌ అధ్యక్షులు జెట్టి గురున్నాధం, అధికార ప్రతినిధి కె.శివాజి, వి.గురున్నాధం, కార్యదర్శులు అన్వర్‌ హుసేన్‌, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లాది విషూ్ణ వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com