విజయవాడ, సూర్య బ్యూరో : అబ్కారీ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఇక ఆన్లైన్లోకి రానుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవకాశంగా తీసుకొని ఆ సేవలను మరింత వేగం చేయనుంది. కానిస్టేబుల్ నుంచి కమిష నర్ స్థాయి వరకు ఎప్పటికప్పుడు కదలికలను తెలుసుకునేందుకు ప్రభుత్వం నూతనంగా ఆ శాఖకు సంబంధించిన కైజాల యాప్ను రూపొందించింది. ఏ ప్రాంతంలో మద్యం దుకాణాలు, బార్లు ఉన్నాయో జియోట్యాగ్ ద్వారా గుర్తించనున్నారు. మొత్తంగా ప్రొహిబిషన్ అండ్గ ఎకై్సజ్ శాఖ రాష్ర్టవ్యాప్తంగా ఆన్లైన్ సర్వీసులు అందుబాటులోకి తీసుకురానుంది. ఉన్నతాధికారుల ఆదేశాల నుంచి కిందిస్థాయి అధికారుల సమాచారం వరకు ఈ యాప్లో సంక్షిప్తంగా ఉంటుంది. సిబ్బంది కదలికలు కనుగొనేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండటానికి ఆస్కారం ఉంటుందని, ఎలాంటి సమాచారం అయినా వెంటనే రాష్ర్ట వ్యాప్తంగా తెలియజేసేందుకు వీలుంటుందని కూడా అధికారులు చెబుతున్నారు.