దివంగత నటి శ్రీదేవి తమిళ చిత్రాలను నిర్మించాలని కోరుకునేవారని ఆమె భర్త బోనీ కపూర్ ఇటీవల వెల్లడించారు. శ్రీదేవి నిర్మించబోయే చిత్రంలో హీరో అజిత్ ను ఎంపిక చేయాలనుకున్నారట. శ్రీదేవి చివరి కోరిక మేరకు బోనీ కపూర్ 'పింక్' చిత్రం తమిళంలో రీమేక్ చేయాలని నిర్ణయించారు. బోనీ కపూర్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "ఈ చిత్రానికి ఇంకా పేరు ఇప్పటివరకు నిర్ణయించలేదని అన్నారు. ఇంగ్లీష్ వింగ్లీష్ లో అజిత్తో కలిసి నటించిన తరువాత శ్రీదేవి మరో తమిళ చిత్రంలో అజిత్ తో నటించాలని ఉందని తెలిపారు. అయితే ఇందుకు తగిన స్క్రిప్టు దొరకలేదు. ఆ తరువాత అజిత్ తమిళ్ లో 'పింక్' చేయాలని సూచించారు. దీనికి శ్రీదేవికూడా సమ్మతి తెలిపారు. ఇప్పుడు బోనీ కపూర్ ఈ సినిమాపై దృష్టిపెట్టారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి తలా 59 అనే పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని 2019 లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ఎ.ఆర్.రహమాన్ సంగీతం సమకూర్చే అవకాశాలున్నాయి. కాగా హిందీలో పింక్ సినిమా 2016 లో విడుదలైంది. ఈ చిత్రంలో తాప్సీపన్నూ, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషించారు.