భాజపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, మిగతా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, 2019 ఎన్నికల సన్నద్ధతపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి భాజపా జాతీయ కార్యదర్శులు రాంమాధవ్, మురళీధర్ రావు, ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, లక్ష్మణ్ హాజరయ్యారు. ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు ఎదురుగాలి వీచింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో అధికారం కోల్పోగా.. మిజోరం, తెలంగాణలో ఆ పార్టీ ఒక్క సీటుకే పరిమితమైపోయిన విషయం తెలిసిందే.