ఏపీకి మరో తుఫాన్ ముంచుకురానుంది. మొన్ననే తిత్లీ ప్రభావంతో ఉత్తరాంధ్ర అతలాకుతలం కాగా ఇప్పుడు దక్షణకోస్తాకు విపత్తు ప్రభావం సూచనలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన కనిపిస్తుండగా రానున్న 24 గంటలలో ఇది బలపడి తుఫాన్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు 1350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే సముద్ర అల్లకల్లోలంగా మారి అలలు ఎగసి పడుతుండగా తుఫాన్ గా మారితే తీరప్రాంతాలలో పెను గాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 70 నుంచి 100 మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. తీరప్రాంతంలో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.