ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి ఉధృత ఆందోళనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 04, 2018, 07:39 AM

అమరావతి: అగ్రిగోల్డ్‌ బాధితుల న్యాయమైన కోర్కెల సాధన కోసం మంగళవారం నుంచి ఈ నెల 20 వరకు అన్ని జిల్లాల్లో ఆందోళలనలను ఉధృతం చేయడానికి అగ్రిగోల్డ్‌ బాధితులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని 600 మండలాల్లో అగ్రిగోల్డ్‌ బాధితులు గ్రామగ్రామాన చైతన్య సదస్సులు, మండల కేంద్రాల్లో బైక్‌ ర్యాలీలను నిర్వహించనున్నారు. 23 నుంచి 27 వరకు విజయవాడ ధర్నాచౌక్‌లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ప్రతి జిల్లా నుంచి ఐదుగురు బాధితులు దీక్షలో కూర్చోనున్నారు. ఈ నెల 28 నుంచి చేపట్టే నిరవధిక నిరాహారదీక్షలో పాల్గొనడానికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బాధితులు తరలిరానున్నారు. బాధితుల డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఖరిని ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి. నాలుగున్నరేళ్లుగా కాలయాపన చేస్తున ప్రభుత్వ తీరు పలు విమర్శలకు తావిస్తోందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com