తిరుమల: కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి మొత్తం 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అలాగే స్వామివారి ఉచిత దర్శనానికి 8గంటల సమయం పడుతోంది. టైంస్లాట్ భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 3గంటల సమయం పడుతుండగా నడకదారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 3గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక దర్శనానికి కూడా 3గంటల సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.