విజయవాడ, మేజర్న్యూస్: భూమా నాగిరెడ్డి రైతు పక్షపాతి. కర్నూలు జిల్లా శిరువెళ్ల మండల పరిధిలో 2007లో వేలాది మంది రైతులు సీడ్గ వరి సాగు చేశారు. ప్రైవేటు కంపెనీ విత్తనాలతో పంట సాగు చేయగా దిగుబడులు చాలా తక్కువగా వచ్చాయి. సీడ్గ కంపెనీ నాసిరకం విత్తనాల కారణంగానే దిగుబడి తక్కువగా వచ్చిందని భావించిన రైతులు ఈ విషయాన్ని భూమా నాగిరెడ్డి ద ష్టికి తెచ్చారు. వేలాది మంది బాధితులుగా ఉన్న ఈ ఘటనపై భూమా స్పందించారు. రైతులతో కలిసి ధర్నాకు దిగారు. కంపెనీ రైతులకు నష్టపరిహారం ఇచ్చే వరకు తన పోరాటం ఆపబోమని హెచ్చరించారు. భూమా పోరాటం దెబ్బకు సీడ్గకంపెనీ దిగొచ్చి రైతులకు రూ.2.5కోట్లు నష్టపరిహారం చెల్లించింది. భూమా ఆనాడు చేసిన పోరాటం ఫలితంగానే 2009 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన శోభా నాగిరెడ్డికి శిరువెళ్లలో భారీ ఆధిక్యం లభించింది. భూమా నాగిరెడ్డి చేసిన మేలును ఇప్పటికీ శిరువెళ్ల ప్రాంత రైతులు గుర్తు చేసుకుంటారు. నంద్యాల చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి చెరుకు రైతుల కష్టాలను భూమా తెలుసుకున్నారు. వారి తరుపున చక్కెర ఫ్యాక్టరీపై రైతులతో(షేర్హోల్డర్స) కలిసి భూమా.. పోరాటం చేశారు. రైతుల సమస్యలపై పోరాడేందుకు భూమా ఎప్పుడూ ముందుండేవారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా భూమా నాగిరెడ్డి అటు నంద్యాల, ఇటు ఆళ్లగడ్డలో కీలకంగా వ్యవహరించారు. పార్టీల కతీతంగా ప్రజలను ఏకం చేసి విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. సమైక్యాంధ్రకు మద్ధతుగా భూమా చేసిన ప్రసంగాలు యువతలో ఉద్యమ స్ఫూర్తి్త రగిలించాయి.