లక్నో : ఉత్తర్ప్రదేశ్లో బిజెపి విజయదుందుభి మోగిస్తుండటంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల ఉత్సాహానికి అంతులేకుండా పోయింది. బిజెపి కార్యకర్తలు లక్నోలో రోడ్లమీద ర్యాలీలు నిర్వహించారు. ‘నో కన్ఫ్యూజన్, నో మిస్టేక్ … గయే అఖిలేష్’ (అయోమయం లేదు, పొరపాటు లేదు… అఖిలేష్ వెళ్లిపోయారు) అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు.