న్యూఢిల్లీ: పంజాబ్లో ఓటమిని అంగీకరించారు ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ప్రజల తీర్పును శిరసావహిస్తామని స్పష్టంచేశారు. కార్యకర్తలు చాలా కష్టపడ్డారని, ఓటమి ఎదురైనా తమ యుద్ధం మాత్రం కొనసాగుతుందని ఆయన ట్వీట్ చేశారు. ఈసారి పంజాబ్లో ఆమ్ ఆద్మీకి విజయావకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పోటాపోటీ స్థానాలు సాధిస్తాయని చెప్పాయి. కానీ ఫలితం మాత్రం మరోలా ఉంది. కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ రాగా.. ఆమ్ ఆద్మీ చాలా దూరంలో నిలిచిపోయింది.