ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువకుడితో బీచ్‌కు వెళ్లి,,,విశాఖ తీరంలో యువతి 12 గంటలు నరకయాతన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 10, 2023, 08:07 PM

విశాఖ తీరంలో యువతి బండరాళ్ల ఇరుక్కుపోయింది. నగర శివారు అప్పికొండ సాగర తీరంలో 12 గంటల నరకం తర్వాత బయటపడింది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ యువతి మరో యువకుడితో కలిసి ఈ నెల 2 నుంచి అప్పికొండ శివాలయ పరిసరాల్లో ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం తీరం దగ్గరర రాళ్ల గుట్టలపై ఆమె ఫొటో తీసుకుంటుండగా.. ఎత్తైన ప్రదేశం నుంచి జారి పడిపోయింది. ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెతో పాటు వచ్చిన యువకుడు అక్కడి నుంచి పారిపోయడు. చుట్టూ చిమ్మ చీకటి, జన సంచారం లేని ప్రదేశం కావడంతో యువతి భయపడింది. అలాగే రాత్రంతా మృత్యువుతో పోరాడింది. సోమవారం ఉదయం బీచ్‌కు వచ్చిన కొందరు వ్యక్తులు యువతిని చూడగా.. అక్కడే ఉన్న గజ ఈతగాళ్ల సహాయంతో అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. యువతి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. కాలుజారి పడిపోయానని.. పరారీలో ఉన్న యువకుడిని ఏం అనవద్దని ఆమె చెబుతోంది. అంబులెన్సు సిబ్బంది యువతి తల్లికి సమాచారమివ్వగా.. వారు విశాఖ బయలుదేరి వెళ్లారు. ఇదిలా ఉంటే తమ కుమార్తె కనపడటంలేదని యువతి తల్లి మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.. ఇంతలో పీఎస్‌ నుంచి అంబులెన్స్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. దువ్వాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పరారీలో ఉన్న యువకుడికి ప్రమాదం జరిగిందని.. అతడు కూడా కేజీహెచ్‌లో ఉన్నట్లు సమాచారం. యువతి మిస్సింగ్ కేసు.. విశాఖకు వెళ్లడం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com