ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా సరిహద్దుల్లో నదిని దాటుతుండగా మెరుపు వరదలు.. ఐదుగురు జవాన్ల మృతి

national |  Suryaa Desk  | Published : Sat, Jun 29, 2024, 10:44 PM

సైనికులు నదిని దాటుతుండగా మెరుపు వరదలు సంభవించాయి. దీంతో జవాన్లు వరదలో కొట్టుకుపోగా.. వీరిలో ఐదుగురు గల్లంతయ్యారు. విషాదకర ఈ ఘటన చైనా సరిహద్దుల్లో చోటుచేసుకుంది. లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ సమీపాన ఉన్న న్యోమా-చుషుల్‌ ప్రాంతంలో భారత సైన్యం శనివారం తెల్లవారుజామున విన్యాసాలు నిర్వహించింది. ఈ క్రమంలో నదిని దాటేందుకు సైనికులు ప్రయత్నించగా.. ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో గల్లంతయిన ఐదుగురు జవాన్లల మృతదేహాలు కొద్దిసేపటి తర్వాత లభ్యమయ్యాయి. తొలుత లభ్యం కాగా.. మిగతా నలుగురి కోసం గాలిస్తున్నారు.


లేహ్‌కు 148 కిలోమీటర్ల దూరంలోని మందిర్ మోర్ వద్ద బోధి నదిలో శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విన్యాసాల్లో భాగంగా యద్ధ ట్యాంక్‌లతో నదిని దాటుతుండగా ఒక్కసారి ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. దీంతో టీ-72 యుద్ద ట్యాంక్‌ మునిగిపోయి.. దానిలోని ఐదుగురు సైనికులు నదిలో కొట్టుకుపోయారు. అప్రమత్తమైన సైన్యం వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి.. గల్లంతైన జవాన్ల కోసం గాలించింది. కానీ, దురదృష్టవశాత్తూ వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని, మృతుల్లో జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్ కూడా ఉన్నారని తెలిపారు. యుద్ద ట్యాంకు కూడా కొట్టుకుపోయిందని పేర్కొన్నారు.


ఈ ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ట్విట్టర్‌ (ఎక్స్)లో దీనిపై స్పందించారు. ‘యుద్ధ ట్యాంకుతో నదిని దాటుతుండగా మన సైన్యానికి చెందిన ఐదుగురు జవాన్లు దురదృష్టకర సంఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.. దేశం కోసం సైనికుల నిరుపమాన సేవలను ఎప్పటికీ మరిచిపోలేం.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ దుఃఖ సమయంలో దేశం వారికి అండగా నిలుస్తుంది’ అని రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com