జైపూర్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేటినుంచి రెండు రోజులపాటు ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రోడ్షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు. కోట, ఝలావర్, సికార్ జిల్లాల్లో జరిగే సభల్లో ఆయన పాల్గొంటారు. రాహుల్ తొలి విడతలో పర్యటనలో భాగంగా హదౌతి ప్రాంతంలో పర్యటిస్తారని, ఈ ప్రాంతంలో కోట, ఝలావర్, బరన్ ప్రాంతాలున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్ చెప్పారు. ఈ ప్రాంతంలో అనేకమంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు. రెండవ విడతలో సికార్ జిల్లాలో రాహుల్ పర్యటిస్తారని పైలట్ చెప్పారు.