ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి రాజస్థాన్‌లో రాహుల్‌ పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 24, 2018, 09:48 AM

జైపూర్‌ :  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేటినుంచి రెండు రోజులపాటు ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రోడ్‌షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు. కోట, ఝలావర్‌, సికార్‌ జిల్లాల్లో జరిగే సభల్లో ఆయన పాల్గొంటారు. రాహుల్‌ తొలి విడతలో పర్యటనలో భాగంగా హదౌతి ప్రాంతంలో పర్యటిస్తారని, ఈ ప్రాంతంలో కోట, ఝలావర్‌, బరన్‌ ప్రాంతాలున్నాయని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ చెప్పారు. ఈ ప్రాంతంలో అనేకమంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు. రెండవ విడతలో సికార్‌ జిల్లాలో రాహుల్‌ పర్యటిస్తారని పైలట్‌ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com