ధవళేశ్వరం: జనానికి పవన్ అభివాదంతో జనసేన పార్టీ కవాతు ప్రారంభమైంది. కిక్కిరిసిన జన సందోహంతో నెలకొన్న కవాతు మొదలైంది. అటు సభా ప్రాంగణం వద్ద..ఇటు కవాతులోను జనం పోటెత్తారు. వీరిని అదుపు చేయడం కష్టతరంగా మారుతోంది. భారీ పోలీస్ బందోబస్తుతో పాటు, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో మోహరించి పరిస్థితులను చక్కబెడుతున్నారు. వాహనం దిగేందుకు పవన్ కి అవకాశం లేకపోవడంతో కడకు వాహనంపై నుండే పవన్ కవాతు సాగుతుంది. సీఎం పవన్ అంటూ జనం ఘన స్వాగతం పలికారు. ఎటు చూసినా జన సంద్రమే.. యువ కెరటం పోటెత్తింది.. అంచనాల్ని మించి జనం తరలివచ్చారు. రెండున్నర కి.మీ బ్రిడ్జీపై కవాతు కొనసాగనుండగా నిర్వాహకులు అప్రమత్తంగా ఉన్నారు.