హౌరా: పశ్చిమ బెంగాల్లో ఇవాళ బీజేపీ పార్టీ 12 గంటల పాటు రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. దీంతో మిడ్నాపూర్లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. గవర్నమెంట్ బస్సులకు నిప్పు అంటించారు. టైర్లను కాల్చేశారు. ఇటీవల నార్త్ దినాజ్పూర్లోని ఇస్లామ్పుర్లో జరిగిన పోలీసుల కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఆ ఘటనకు నిరసనగా ఇవాళ బీజేపీ బంద్కు పిలుపునిచ్చింది. బస్సులపై దాడి జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్లు తలకు హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నారు. హౌరా-బర్దమన్ రైల్వే మార్గంతో పాటు మరికొన్ని రూట్లలో నిరసనకారులు రైళ్లను నిలిపేశారు. బంద్ నేపథ్యంలో ఇవాళ హౌరా సిటీలో భద్రతను పెంచారు. అన్ని కీలక ప్రాంతాల్లో అదనపు భద్రతను మోహరించారు.