ఉయ్యూరు : కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం వెల్లటూరులో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి కొండ అగ్నిసమ్మకు రూ.20 వేల ఆర్ధికసాయం మంజూరైంది. మైలవరం ఎఎంసి చైర్మన్ వుయ్యూరు నరసింహారావు, గ్రామ టిడిపి అధ్యక్షులు పచ్చిగోళ్ళ రామారావు దేవినేని ఉమ యూత్ అధ్యక్షులు పచ్చిగోళ్ళ బాలకృష్ణ వెల్లటూరులో ఆర్థికసాయాన్ని బుధవారం చెక్కు రూపంలో అందజేశారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారి కృషితో ఆర్థికసాయం మంజూరైనట్లు టీడీపీ నేతలు తెలిపారు. అగ్నిసమ్మ మంత్రి ఉమ గారికి, టిడిపి నేతలకు కృతజ్ఞతలు తెలిపింది. ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు తోట ఆంజనేయులు, రేణిమడుగుల శివయ్య, గంధం శ్రీనివాసరావు, కారుకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.