ఏలూరు : జంగరెడ్డిగూడెం లో ఎర్రకాల్వ జలాశయానికి వరదనీరు పోటెత్తింది. ఉదయం ఇరిగేషన్ అధికారులు 4 గేట్లు ఎత్తి సుమారు 27000 క్కుసెక్కుల నీటిని విడుదల చేశారు. కాగా ప్రస్తుతం వరద నీటి తాకిడి పెరగడంతో జలాశయం అన్ని గేట్లను ఎత్తివేసి భారీ మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పరిసర గ్రామాలకు వరద ముప్పు ఉండటంతో ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పలు గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలుతున్నారు.