ఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. అధికార ఎన్డీయే, విపక్షాల ఐక్య కూటమి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అధికార పక్షాల అభ్యర్థిగా జేడీయూకు చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్.. విపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్కు చెందిన బి.కె.హరిప్రసాద్ బరిలో ఉన్నారు. రాజ్యసభ ఛైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎన్నిక నిర్వహణ చేపట్టారు.